లేడీ టీచర్ అత్యాచారం కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-06T16:07:23+05:30 IST

తనపై అత్యాచారం జరిగిందని..

లేడీ టీచర్ అత్యాచారం కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇంటర్‌నెట్‌డెస్క్: తనపై అత్యాచారం జరిగిందని ఓ లేడీ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో కొత్త కొత్త విషయాలు బయటపడుతుండడంతో పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


జిల్లాలోని కృష్ణగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల ఉంది. అందులో ఓ మహిళ టీచర్‌గా చేరింది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ముంతాజ్ అన్సారీ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పిడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. దీంతో అవకాశం చిక్కినప్పుడల్లా ఆమెతో శారీరకంగా కలిశాడు. పెళ్లి చేసుకోమని ఆ లేడీ టీచర్ అడిగినప్పుడల్లా.. మాట దాటవేసేవాడు. ఆమెకు అనుమానం వచ్చి అతడిని దూరం పెట్టడం మొదలు పెట్టింది. కానీ అతను మాత్రం ఆమెను వదలలేదు. అదే ఊర్లో ఆ మహిళ ఒక్కతే గది అద్దెకు తీసుకుని ఉంటోంది. సెప్టెంబర్ 27న కూడా అతను ఆమె ఉంటున్న గదికి వెళ్లాడు. టీ ఇవ్వమని కోరాడు. ఆమె అయిష్టంగానే టీ పెట్టి ఇచ్చింది. కానీ అతడి వక్రబుద్ధి ఊరికనే ఉండదు కదా! ఆమెను బలవంతం చేసి లొంగదీసుకున్నాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా కొన్ని ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఆ వీడియోలను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. 



వీడియోలు సోషల్ మీడియాలో కనపడడంతో ఆమె మానసికంగా కృంగిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన విషయం మొత్తం చెప్పింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. లేడీ టీచర్‌కు పెళ్లి కాలేదని పరిచయం చేసుకున్న ముంతాజ్ అన్సారీకి ఇంతకుముందే పెళ్లైంది. అతడికి ఒక  బిడ్డ కూడా ఉంది. అంతేకాకుండా పోలీసులకు మరో విషయం తెలిసింది. ఆ లేడీ టీచర్‌కు కూడా ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని.. భర్తతో విభేదాలు తలెత్తడంతో అతని నుంచి విడాకులు తీసుకుందని తెలిసింది. మరింత సమాచారం కోసం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Updated Date - 2021-10-06T16:07:23+05:30 IST