ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్
ABN , First Publish Date - 2021-06-18T03:08:24+05:30 IST
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. మెగా సొలార్ పవర్
అమరావతి: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ టెండర్ను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశించింది. విద్యుత్ కొనుగోలు సైతం తాజాగా రూపొందించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. పవర్ ప్రాజెక్టు టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా ఉందని హైకోర్టును టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆశ్రయించింది. ఏపీ విద్యుత్ నియంత్రణ చట్టం విచారణాధికారి పరిధి హక్కులను పీపీఏలో తొలగించడం చట్ట విరుద్ధమన్న టాటా ఎనర్జీ వాదించింది. ఒప్పందంలో వివాదం వస్తే నియంత్రణ మండలి కాకుండా ప్రభుత్వమే సమస్యను పరిష్కరించేందుకు వీలుంటుందని టాటా ఎనర్జీ వాదించింది. ఇది టెండర్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని టాటా ఎనర్జీ పేర్కొంది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది.