ఉద్యాన పంటల ఉసురు తీసిన తుపాను
ABN , First Publish Date - 2020-11-28T06:21:51+05:30 IST
నివర్ తుపాను జిల్లాలోని ఉద్యాన పం టల ఉసురుతీసింది. రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షా లకు ఉద్యానరైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒంగోలు(జడ్పీ), నవంబరు 27: నివర్ తుపాను జిల్లాలోని ఉద్యాన పం టల ఉసురుతీసింది. రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షా లకు ఉద్యానరైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్దారవీడు, పు ల్లలచెరువు, త్రిపురాంతకం, యర్రగొండపాలెం ప్రాంతాల్లో మిరప, బొప్పా యి, కూరగాయపంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కాపుర్ డివిజన్లో దోస, టమాటో, మిరప పంటలకు అధిక నష్టం చేకూరింది. ప్రాథమిక అం చనా ప్రకారం నివర్ తుఫాన్ దాటికి జిల్లాలో 1506.81 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు హార్టికల్చర్ ఏడీ యు.నాగరాజు తెలిపారు. మిరప 1360.71, బొ ప్పాయి 49.80, అరటి 0.60, పసుపు 3.00, టమాటో 27.20, దోస 2.50, కూ రగాయలు 63 హెక్టార్లపై తుపాను ప్రభావం ఉందని ఆయన తెలిపారు. 1865 మంది రైతులు నివర్ ధాటికి నష్టపోయారని చెప్పారు. నష్టం విలువ ప్రాథమికంగా రూ.15 కోట్లకు పైనే ఉండొచ్చని, వర్షాలు తగ్గుముఖం పట్టాక పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తామని ఏడీ పేర్కొన్నారు.