KBC: ఆ మాటలు విని భావోద్వేగానికిలోనైన బిగ్ బీ
ABN , First Publish Date - 2021-10-06T23:53:23+05:30 IST
బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా ఉన్న కౌన్ బనేగా కరోడ్సతి ప్రోగ్రామ్కు ఉన్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా.. ఇప్పటి వరకు 12 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ ప్రోగ్రామ్లో ఎంతో మంది కంటెస్టెంట్లు హాట్ సీట్ వరకూ వచ్చి.. ఎంతో కొంత డబ్బును
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా ఉన్న కౌన్ బనేగా కరోడ్సతి ప్రోగ్రామ్కు ఉన్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా.. ఇప్పటి వరకు 12 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ ప్రోగ్రామ్లో ఎంతో మంది కంటెస్టెంట్లు హాట్ సీట్ వరకూ వచ్చి.. ఎంతో కొంత డబ్బును గెలుచుకోవడంతోపాటు తమ కష్టనష్టాలను బిగ్ బీతో సహా ప్రేక్షకులతో పంచుకున్నారు. అయితే తాజా ఎపిసోడ్లో హాట్ సీట్ వరకూ వెళ్లిన ఓ కంటెస్టెంట్ మాత్రం.. తన కుటుంబంలో చోటు చేసుకున్న హృదయ విదాకరమైన ఘటనను చెప్పి అందరి హృదయాలను తాకాడు. బిగ్ బీతో సహా ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తెప్పించాడు.
ఓ కోచింగ్ సెంటర్కు యజమాని అయిన చిరాగ్.. కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్లో హాట్ సీట్ వరకూ వెళ్లారు. ఈ ప్రోగ్రామ్లో అమితాబ్ అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానం చెబుతూనే తన కుటుంబ నేపథ్యాన్ని బిగ్ బీ ఉంచారు. ఈ క్రమంలోనే తన తమ్ముడు మయాంక్ స్థాపించిన కోచింగ్ సెంటర్కు తాను యజమాని కావడానికి దారి తీసిన పరిస్థితులను చిరాగ్ వివరించారు. చదువు పూర్తైన తర్వాత తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందని.. ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలా వద్దా ఆలోచిస్తుండగా మయాంక్ తనకు అండగా నిలిచాడని చెప్పుకొచ్చారు. కుటుంబ బాధ్యతలను మయాంక్ తీసుకుని.. తనను అమెరికా పంపించినట్లు పేర్కొన్నారు. అంతా బాగానే సాగిపోతున్న క్రమంలో.. మయాంక్ ఇక లేడనే వార్త విని షాక్ అయినట్లు చెప్పారు. మయాంక్ను ఎవరో హత్య చేసినట్లు తెలుసి గుండెలవిసేలా రోదించినట్లు తెలిపారు.
ఈ ఘటనతో అమెరికా నుంచి తిరుగు పయనమై.. స్వస్థలానికి చేరుకున్నట్లు చెప్పారు. మయాంక్ స్టార్ట్ చేసిన కోచింగ్ క్లాసులను ప్రస్తుతం తాను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మయాంక్ను హత్య చేసిందేవరో తెలిసిందా? అని బిగ్ బీ చిరాగ్ ప్రశ్నించారు. దీంతో స్పందించిన మయాంక్.. ‘హత్య చేసిందెవరో తెలిసింది.. కానీ అతడిని ఏదో చేసినంత మాత్రాన నా తమ్ముడు తిరిగి రాడు కదా’ అని సమాధానం చెప్పడంతో బిగ్ బీ సహా ప్రేక్షకులు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. ఎపిసోడ్ ముగిసే సమయానికి చిరాగ్ రూ.6.40లక్షలను గెలుచుకుని ఆటలో కొనసాగుతున్నారు.