ముగిసిన బీబీ జైనబ్బీ ఉరుసు ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-09-24T05:16:43+05:30 IST
పట్టణంలోని బీబీ జైనబ్బీ దర్గా ఉరుసు ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి.
ఉరవకొండ, సెప్టెంబరు 23: పట్టణంలోని బీబీ జైనబ్బీ దర్గా ఉరుసు ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉరుసు ఉత్సవాలలో భాగంగా జియారత్ను నిర్వహిం చారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం అర్థరాత్రి షంషేర్ ను పట్టణంలోని వీధుల గుండా ఊరేగించారు. ఉత్సవాలలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొని చాదర్ను సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు అల్లాబక్ష్, ప్యారం కేశవనంద, ఖాదర్, నూర్ పాల్గొన్నారు.