Yadadriకి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2021-10-31T17:29:17+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు
యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతిని నిరాకరించారు.