భూటాన్‌లోనూ ‘భీం’ యూపీఐ

ABN , First Publish Date - 2021-07-14T07:15:36+05:30 IST

భారత్‌లోని ‘భీం’ యూపీఐ పేమెంట్స్ విధానాన్ని భూటాన్ దేశంలోనూ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భూటాన్ ..

భూటాన్‌లోనూ ‘భీం’ యూపీఐ

న్యూఢిల్లీ: భారత్‌లోని ‘భీం’ యూపీఐ పేమెంట్స్ విధానాన్ని భూటాన్ దేశంలోనూ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భూటాన్ ఆర్థికమంత్రి ల్యోన్పో నంగే త్సెరింగ్ సంయుక్తంగా భారత భీం యూపీఐ పేమెంట్స్ విధానాన్ని భూటాన్‌లో లాంచ్ చేశారు. దీంతో భారత్ తర్వాత యూపీఐ పేమెంట్స్‌ను అమలు చేయబోతున్న తొలి దేశంగా భూటాన్ నిలిచింది. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఫిన్‌టెక్ ద్వారా భారత్ సాధించిన ఓ గొప్ప ప్రగతి యూపీఐ పేమెంట్స్ అని చెప్పారు. అనంతరం ప్రత్యక్షంగా ఓ భీం యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారు

Updated Date - 2021-07-14T07:15:36+05:30 IST