గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్

ABN , First Publish Date - 2021-09-13T20:12:18+05:30 IST

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ సోమవారంనాడు ప్రమాణ..

గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్

గాంధీనగర్: గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ సోమవారంనాడు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నరేంద్ర సింగ్ తోమర్, మన్షుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, పర్సోత్తమ్ రూపాల, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రమోద్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత శనివారంనాడు విజయ్ రూపానీ, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయడంతో కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఆదివారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోదీ శుక్షాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-09-13T20:12:18+05:30 IST