భూపాలపల్లి జిల్లాలో దారుణం
ABN , First Publish Date - 2022-04-14T20:54:51+05:30 IST
భూపాలపల్లి జిల్లాలో దారుణం
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో ఉరేసుకొని షేషెంట్ బాపు(50) ఆత్మహత్య చేసుకున్నారు. బిల్లు కట్టలేదని స్మార్ట్ కేర్ ఆస్పత్రి యాజమాన్యం వేధింపులకు గురి చేసిందన్నమనస్తాపంతో బాధితుడు మర్రి బాపు ఆత్మహత్య చేస్తున్నారు. జెన్కోలో భూమి కోల్పోయిన తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ నెల 1న పురుగుల మందుతాగి మర్రిబాబు ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుడిని కేటీపీపీ అధికారులు స్మార్ట్ కేర్ ఆస్పత్రిలో చేర్చారు. రూ.60 వేల బిల్లు చెల్లించకపోవడంతో యాజమాన్యం బయటకు పంపింది. యాజమాన్యం తీరుపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.