అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న భూమా అఖిలప్రియ

ABN , First Publish Date - 2021-08-01T01:03:27+05:30 IST

ఆళ్ళగడ్డ మండలం కృష్ణాపురం శివారులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ మైనింగ్‌ను మాజీమంత్రి భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు.

అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న భూమా అఖిలప్రియ

కర్నూలు: ఆళ్ళగడ్డ మండలం కృష్ణాపురం శివారులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ మైనింగ్‌ను మాజీమంత్రి భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటు ఆమె ఆందోళనకు దిగారు. గత రెండు నెలల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని, దీంతో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తక్షణమే చర్యలు చేపట్టక పోతే కోర్టుకు వెళ్తామని అఖిలప్రియ హెచ్చరించారు.

Updated Date - 2021-08-01T01:03:27+05:30 IST