కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందుకు అఖిలప్రియ

ABN , First Publish Date - 2021-01-14T16:16:53+05:30 IST

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1 గా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పోలీస్ కస్టడీ నిన్నటితో ముగిసింది.

కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందుకు అఖిలప్రియ

హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1 గా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పోలీస్ కస్టడీ నిన్నటితో ముగిసింది. మరికాసేపట్లో అఖిల ప్రియను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరుచనున్నారు. అఖిల ప్రియను బేగంపేట మహిళ పోలీస్ స్టేషన్ నుండి 11 గంటలకు గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు. గాంధీ ఆసుపత్రిలో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు సెలవురోజు మేజిస్ట్రేట్ ఇంటికి అఖిలప్రియను తీసుకెళ్లనున్నారు. అనంతరం మేజిస్ట్రేట్ ఇంటి నుండి చంచలగూడా జైలుకి తరలిస్తారు. అఖిలప్రియకు 14 రోజుల రిమైండ్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-01-14T16:16:53+05:30 IST