గాంధీ ఆస్పత్రికి చేరుకున్న అఖిలప్రియ
ABN , First Publish Date - 2021-01-14T18:17:47+05:30 IST
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అఖిలప్రియను బోయిన్పల్లి పోలీసులు గాంధీకి తీసుకువచ్చారు. అనంతరం అఖిలను మారేడ్పల్లి న్యాయమూర్తి నివాసానికి తరలించనున్నారు.
అంతకుముందు అఖిల ప్రియకు వైద్య పరీక్షలు చేయించే క్రమంలో పోలీసుల హై డ్రామా వెలుగు చూసింది. మీడియా దృష్టి మరల్చి మరోసారి అఖిల ప్రియను బేగంపేట్లోని పటిగడ్డ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కు తీసుకువెళ్లారు. కరోనా పరీక్షల కోసం వచ్చిన అఖిల ప్రియకు ప్రైమరీ హెల్త్ సెంటర్లో కరోనా టెస్ట్ నిర్వహించకుండానే వైద్య పరీక్షల కోసం బోయిన్పల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అఖిల ప్రియ పోలీస్ వాహనం ముందూ వెనుకా ఎస్కర్ట్గా విమెన్ పోలీసులు ఉన్నారు.