భూగర్భ జలం.. పెంపే లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-05T05:47:01+05:30 IST

ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా జలశక్తి అభియాన్‌ ఆధ్వర్యంలో క్యాచ్‌ ద రైన్‌ 2022 కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టిందని అణుశక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌, జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి ఇ.రవీందరన్‌ పేర్కొన్నారు.

భూగర్భ జలం.. పెంపే లక్ష్యం
మామిడి, జామ చెట్లను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

సంగం, జూలై 4 : ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యంగా జలశక్తి అభియాన్‌ ఆధ్వర్యంలో క్యాచ్‌ ద రైన్‌ 2022 కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టిందని అణుశక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌, జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి ఇ.రవీందరన్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన జలశక్తి అభియాన్‌ శాస్త్రవేత్త రూపేష్‌ కుమార్‌, జిల్లా డ్వామా పీడీ తిరుపతయ్యతో కలిసి సోమవారం సంగం, వింజమూరు, కలిగిరి, కొండాపురం, కావలి, జలదంకి తదితర మండలాల్లో పర్యటించారు. సంగం మండలంలోని వెంగారెడ్డిపాళెం, సంగం గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద చేపట్టిన మామిడి, జామ సాగును వారు పరిశీలించారు. నాటిన మొక్కలు ఎన్ని సంవత్సరాలకు ఫలాలు ఇస్తాయి, నీటి సదుపాయం, ఎన్ని అడుగుల్లో నీరు పడుతుంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవీందరన్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. కేంద్ర బృందం వెంట ఎంపీడీవో సుజాత, ఏపీవో శ్రీనివాసరావు, వెంగారెడ్డిపాళెం సర్పంచు ఆనం ప్రసాద్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-07-05T05:47:01+05:30 IST