చిత్రలేఖనం పోటీల్లో భువనేశ్వరి ప్రతిభ

ABN , First Publish Date - 2020-10-02T08:41:16+05:30 IST

జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కేంద్రీయ విద్యాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.

చిత్రలేఖనం పోటీల్లో  భువనేశ్వరి ప్రతిభ

రాజమహేంద్రవరం రూరల్‌,  అక్టోబరు 1: జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కేంద్రీయ విద్యాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థిని గుత్తి భువనేశ్వరి మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో కూడిన చిత్రం గీయగా పాఠశాలలో ఆవరణలో పెట్టారు. భువనేశ్వరిని ఉపాధ్యాయులతో పాటు పలువురు అభినందించారు. 

Updated Date - 2020-10-02T08:41:16+05:30 IST