వేటగాళ్ల చేతిలో ముగ్గురు పోలీసులు హతం
ABN , First Publish Date - 2022-05-15T07:26:44+05:30 IST
కొందరు వేటగాళ్లు మధ్యప్రదేశ్లో దారుణానికి ఒడిగట్టారు.
భోపాల్, మే 14: కొందరు వేటగాళ్లు మధ్యప్రదేశ్లో దారుణానికి ఒడిగట్టారు. తమను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులకు తెగబడటంతో ఓ సబ్ ఇన్స్పెక్టర్(ఎ్సఐ)తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. గుణ జిల్లాలోని సగా బర్ఖేడ అనే గ్రామ సమీపంలో వేటగాళ్లు ఉన్నారనే సమాచారంతో శనివారం వేకువ జామున పోలీసులు దాడి చేశా రు. వారిని అడ్డుకునేందుకు వేటగాళ్లు కాల్పులు ప్రారంభించగా పోలీసులు కూడా ఎదురుదాడికి దిగారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులకు నాలుగు జింకలు, ఓ నెమలి శరీర భాగాలను లభించాయి.