జనసేన ఆధ్వర్యంలో భోగి సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-15T07:34:41+05:30 IST

ఏర్పేడు మండలంలోని కందాడు, సదాశివపురం గ్రామాల్లో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

జనసేన ఆధ్వర్యంలో భోగి సంక్రాంతి సంబరాలు
సరుకుల పంపిణీలో జనసేన నాయకులు

ఏర్పేడు, జనవరి 14: మండలంలోని కందాడు, సదాశివపురం గ్రామాల్లో శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. స్థానిక ప్రజలతో కలసి భోగిమంటలు వేసి సందడి చేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి కొట్టే సాయి తదితరులు పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో  నాయకులు కుమార్‌, లీలాధర్‌, షణ్ముగం, సురేష్‌, లోకేష్‌, విజ్ఞేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-15T07:34:41+05:30 IST