మావుళ్ళమ్మ జ్యేష్టమాస జాతర ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-24T09:57:16+05:30 IST

మావుళ్ళమ్మ జ్యేష్టమాస జాతర పురస్కరించుకుని అమ్మవారిని శనివారం సాయంత్రం నిలబెట్టారు.

మావుళ్ళమ్మ జ్యేష్టమాస జాతర ప్రారంభం

భీమవరంటౌన్‌, మే 23 :  మావుళ్ళమ్మ జ్యేష్టమాస జాతర పురస్కరించుకుని అమ్మవారిని శనివారం సాయంత్రం నిలబెట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు కొడమంచిలి సుబ్రహ్మణ్యం, ఉప ప్రధానార్చకుడు మద్దిరాల మల్లిఖార్జునశర్మ అమ్మవారి గరగలకు పూజలు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా భక్తులకు ప్రవేశం లేకపోవడంతో ఏకాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యేష్టమాసం ప్రారంభం సందర్భంగా శనివారం గునుపూడి బంట్రోతుల వారి వీధిలోని శ్రీకృష్ణుడి ఆలయంలో స్వామికి అనాస పండ్లతో అలంకారం చేశారు. ఆలయ అర్చకుడు కొమ్ము శ్రీనివాస్‌ అభిషేకాలు నిర్వహించారు.  

Updated Date - 2020-05-24T09:57:16+05:30 IST