వైసీపీ బెదిరింపులకు బెదరవద్దు : సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-04-13T03:59:07+05:30 IST

సంక్షేమ పథకాలను కట్‌ చేస్తామనే వైసీపీ ఉడుత బెదిరింపులకు ఏ ఒక్కరూ బెదరవద్దని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్ర

వైసీపీ బెదిరింపులకు బెదరవద్దు : సోమిరెడ్డి
టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్‌ కొంగర పెంచలయ్యతో మాజీ మంత్రి సోమిరెడ్డి

వెంకటాచలం, ఏప్రిల్‌ 12 : సంక్షేమ పథకాలను కట్‌ చేస్తామనే వైసీపీ ఉడుత బెదిరింపులకు ఏ ఒక్కరూ బెదరవద్దని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కురిచెర్లపాడు, పాలిచెర్లపాడు, చవటపాళెం, వెంకటాచలం, ఇస్కపాళెం గ్రామాల్లో సోమవారం సాయంత్రం  ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గపు పాలనలో పేదలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.  తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మికి ఓట్లు వేసి గెలిపిస్తే వైసీపీ మూడేళ్ల పాలన బుద్ధిగా ఉంటుందన్నారు.  గ్రామాల్లో ఎక్కడా చూసిన వైసీపీ అవినీతి, అక్రమాలే కనిపిస్తాయన్నారు.  కార్యక్రమంలో ఎరిక్సన్‌ బాబు, రాజాయాదవ్‌, కోదండయ్యనాయుడు, శ్రీనివాసులునాయుడు, రమేష్‌నాయుడు,  తదితరులు పాల్గొన్నారు.


మాజీ సర్పంచ్‌ టీడీపీలో చేరిక


మండలంలోని కురిచెర్లపాడు మాజీ సర్పంచ్‌ కొంగర పెంచలయ్య సోమవారం సాయంత్రం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన పెంచలయ్యకు కండువా కప్పి సాదరంగా  అహ్వానించారు. కార్యక్రమంలో పాపనాయుడు, రామ్ముర్తి, గిరినాయుడు, ఎల్‌ వెంకయ్యనాయుడు, ప్రభాకర్‌నాయుడు పాల్గొన్నారు.

---------


Updated Date - 2021-04-13T03:59:07+05:30 IST