భవాని ఆత్మహత్య కేసులో ముగ్గురు అరెస్ట్
ABN , First Publish Date - 2022-07-24T23:24:16+05:30 IST
అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కోనసీమ: అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవాని ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కార్యదర్శి భావానీని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్న నిందితులు వరసాల సత్యనారాయణ, యర్రంశెట్టి నాగరాజు, ముత్తాబత్తుల సూరిబాబును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆధారాలతో మీడియాకు జిల్లా ఎస్పీ వెల్లడించారు.