నేటి నుంచి భవాని దీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-25T17:22:41+05:30 IST

విజయవాడ: నేటి నుంచి భవాని దీక్షలు ప్రారంభం కానున్నాయని...

నేటి నుంచి భవాని దీక్షలు ప్రారంభం

విజయవాడ: నేటి నుంచి భవాని దీక్షలు ప్రారంభం కానున్నాయని... దుర్గామల్లేశ్వర దేవస్థానం ఈవో సురేష్ బాబు వెల్లడించారు. గత 43 ఏళ్లుగా దేవస్థానంలో భవాని దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మహామండపంలోని 6వ అంతస్థులో భవాని దీక్షాపరుల కోసం నేటి నుంచి ఈనెల 30 వరకూ పూర్తి చేయనున్నారు. అర్దమండల దీక్ష డిసెంబర్ 15నుంచి 19వ తారీఖు వరకూ.. జనవరి 5నుంచి 9వ తారీఖు వరకూ భవాని దీక్ష మాల విరమణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది 12లక్షలకు పైగా భక్తులు దీక్ష తీసుకుంటారన్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా సంఖ్య తగ్గవచ్చు అని అంచనా వేస్తున్నారు. దీక్ష భవానీలు ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకుని రావాలన్నారు. మరో రెండు రోజుల్లో విరమణ వివరాలు పూర్తి స్థాయిలో తెలియజేస్తామని ఈవో సురేష్ బాబు వెల్లడించారు.


Updated Date - 2020-11-25T17:22:41+05:30 IST