TS News: డెబ్బై ఐదు మందితో.. డెబ్బై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర: భట్టి

ABN , First Publish Date - 2022-08-09T18:01:29+05:30 IST

కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని...

TS News: డెబ్బై ఐదు మందితో.. డెబ్బై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర: భట్టి

ఖమ్మం జిల్లా (Khammam Dist.): కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం జిల్లా, కూసుమంచిలో పాదయాత్ర (Pada Yatra) సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ (Azadi Ka Amrit) పేరుతో పాదయాత్ర చేపట్టామన్నారు. పాదయాత్ర డెబ్బై ఐదు మందితో డెబ్బై ఐదు కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. యాత్రలో స్వాతంత్ర్యం కోసం  పోరాడిన వాళ్ళ త్యాగాలను ప్రజలకు వివరిస్తూ... వాళ్ళను సన్మానిస్తూ పాదయాత్ర సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఖమ్మం జిల్లా నాయకత్వం పాల్గొంది.

Updated Date - 2022-08-09T18:01:29+05:30 IST