ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-02-27T17:42:15+05:30 IST

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర: భట్టి విక్రమార్క

ఖమ్మం: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ముదిగొండ మండలం యడవెల్లి నుంచి యాత్ర చేపట్టినట్లు తెలిపారు. 32 రోజులపాటు పాదయాత్రను కొనసాగిస్తానని చెప్పారు. తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసం..కేసీఆర్ కుటుంబం కోసం కాదన్నారు. రాష్ట్ర సంపద ప్రజలకు చెందాలి..కేసీఆర్‌ కుటుంబానికి కాదని చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వారిని.. అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. 

Updated Date - 2022-02-27T17:42:15+05:30 IST