తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-04-26T21:45:02+05:30 IST

హక్కుల సాధన కోసం సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రజానీకం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

ఖమ్మం: హక్కుల సాధన కోసం.. సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రజానీకం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం భట్టి మీడియాతో మాట్లాడుతూ... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వరంగల్  రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావాలని భట్టి విక్రమార్క తెలిపారు. 

Updated Date - 2022-04-26T21:45:02+05:30 IST