అప్రజాస్వామికంగా సభను నడుపుతున్నారు: భట్టి

ABN , First Publish Date - 2022-03-07T19:22:40+05:30 IST

అప్రజాస్వామికంగా శాసనసభను నడుపుతున్నారని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

అప్రజాస్వామికంగా సభను నడుపుతున్నారు: భట్టి

హైదరాబాద్: అప్రజాస్వామికంగా శాసనసభను నడుపుతున్నారని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బడ్జెట్ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అనంతరం బయటకు వచ్చిన భట్టి మీడియాతో మాట్లాడుతూ సభలో నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ లేవనెత్తినా మైక్ ఇవ్వలేదన్నారు. సభా గౌరవాన్ని మంటగలిపారని మండిపడ్డారు. అసెంబ్లీ ఏమైనా టీఆర్ఎస్ ఆఫీసా? అని ప్రశ్నించారు. ఇష్టానుసారం సభ నడపడం సరికాదని, సభాపతిని చూసి సిగ్గుపడుతున్నామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-07T19:22:40+05:30 IST