Subrahmanyam మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

ABN , First Publish Date - 2022-05-22T13:53:32+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్ డ్రైవర్ హత్య కేసు. మృతుడు సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది

Subrahmanyam మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

కాకినాడ: వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. సుబ్రహ్మణ్యం భార్యకు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇక ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ను పోలీసులు ప్రధాన నిందితుడి(A1)గా చేర్చారు. మృతుడి కుటుంబీకుల స్టేట్‌మెంట్ ఆధారంగా ఉదయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రత్యేక బృందాలతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేడు ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Updated Date - 2022-05-22T13:53:32+05:30 IST