సాగర్‌ ఎస్పీఎఫ్‌ ఆర్‌ఐగా భాస్కర్‌

ABN , First Publish Date - 2022-08-08T05:56:38+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్పీఎఫ్‌ ఆర్‌ఐ గా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న పవనకుమార్‌ ఎస్పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అమీనపూర్‌కు బదిలీ అయ్యారు.

సాగర్‌ ఎస్పీఎఫ్‌ ఆర్‌ఐగా భాస్కర్‌
పవనకుమార్‌ను సన్మానిస్తున్న చంద్రశేఖర్‌

నాగార్జునసాగర్‌, ఆ గస్టు 7: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్పీఎఫ్‌ ఆర్‌ఐ గా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న పవనకుమార్‌ ఎస్పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అమీనపూర్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అసెంబ్లీలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌ పదోన్నతిపై ఎస్పీఎఫ్‌ ఆర్‌ఐగా సాగర్‌కు వ చ్చారు. ఈ సందర్భంగా పవనకుమార్‌ను ఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ చం ద్రశేఖర్‌ శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాగ ర్‌ ఎస్‌ఐ రాంబాబు, ఎస్పీఎఫ్‌ సిబ్బంది పుల్లయ్య, సాయికిరణ్‌, మట్టయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:56:38+05:30 IST