అమెరికాలో పూర్తైన భారతి షహాని అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-11-18T01:36:18+05:30 IST

ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన భారత్‌కు చెందిన భారతి షహాని మరణించారు. ఈ క్రమంలో మంగళవారం రోజు హ్యూస్టన్‌లో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. బంధువులు, సన్నిహితులు.. ఆ

అమెరికాలో పూర్తైన భారతి షహాని అంత్యక్రియలు

ఎన్నారై డెస్క్: ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన భారత్‌కు చెందిన భారతి షహాని మరణించారు. ఈ క్రమంలో మంగళవారం రోజు హ్యూస్టన్‌లో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. బంధువులు, సన్నిహితులు.. ఆమెకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 


హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ పార్క్‌లో నవంబర్ 5న ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్-2021 పేరుతో మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ర్యాప్‌ సింగర్ ట్రావిస్ స్కాట్, డ్రేక్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలి వెళ్లారు. భారత్‌కు చెందిన భారతి షహాని కూడా తన సోదరి నమ్రతా షహాని, కజీన్ మోహిత్‌‌తో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రముఖ ర్యాప్ సింగర్ ట్రావిస్ స్కాట్.. స్టేజిపైకి చేరుకున్న వెంటనే జనం ఒక్కసారిగా స్టేజిపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో భారతీ షహాని తీవ్రంగా గాయపడటంతో బ్రెయిన్ డెడ్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె తుదిశ్వాస విడిచారు. 




Updated Date - 2021-11-18T01:36:18+05:30 IST