అసంఘటిత కార్మికులకు భరోసా ఈ-శ్రమ్ కార్డు
ABN , First Publish Date - 2022-07-06T05:20:25+05:30 IST
అసంఘటిత కార్మికులకు భరోసా ఈ-శ్రమ్ కార్డు అని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు.
జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ
సిద్దిపేట అగ్రికల్చర్, జూలై 5: అసంఘటిత కార్మికులకు భరోసా ఈ-శ్రమ్ కార్డు అని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని టీటీసీ భవన్లో కార్మికశాఖ, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ-శ్రమ్ పథకంపై అవగాహన, ఉచిత నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ-శ్రమ్ కార్డు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు గొప్ప వరమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మహేందర్, జిల్లా పంచాయతీరాజ్శాఖ అధికారి దేవకీదేవి, సిద్దిపేట మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్మంతరెడ్డి పాల్గొన్నారు.