ఉత్తరాఖండ్లో పార్టీని గెలిపించి ఓడిపోయిన సీఎం ధామీ
ABN , First Publish Date - 2022-03-10T21:11:50+05:30 IST
ఖటీమా: ఉత్తరాఖండ్లో బీజేపీని గెలిపించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఓటమి పాలయ్యారు. ఖటీమా నియోజకవర్గం నుంచి ఆయన ఆరువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఖటీమా: ఉత్తరాఖండ్లో బీజేపీని గెలిపించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఓటమి పాలయ్యారు. ఖటీమా నియోజకవర్గం నుంచి ఆయన ఆరువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అధిష్టానం ఇటీవలే సీఎం తీరథ్ సింగ్ రావత్ను తప్పించి ఆయన్ను ఉత్తరాఖండ్ సీఎం చేసింది. పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించి ధామీ మాత్రం ఓడిపోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.