తిరువూరులో కనపడని Bharath bandh ప్రభావం
ABN , First Publish Date - 2022-06-20T15:09:12+05:30 IST
జిల్లాలోని తిరువూరులో భారత్ బంద్ ప్రభావం కనిపించడం లేదు. వ్యాపార సంస్థలు, హోటళ్ళు యధావిధిగా తెరుచుకున్నాయి.
ఎన్టీఆర్: జిల్లాలోని తిరువూరులో Bharath bandh ప్రభావం కనిపించడం లేదు. వ్యాపార సంస్థలు, హోటళ్ళు యధావిధిగా తెరుచుకున్నాయి. అలాగే రోడ్లపై ఆర్టీసీ బస్సులు యదేచ్ఛగా తిరుగుతున్నాయి. బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ పేరిట హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సిహెచ్ దుర్గాప్రసాద్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్కు నిరసనగా పలు రాష్ట్రాలలో భారత్ బంద్కు ఆర్మీ అభ్యర్థులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.