8న భారత్బంద్ విజయవంతం చేద్దాం
ABN , First Publish Date - 2020-12-06T05:05:04+05:30 IST
రైతు ఆందోళనకు మద్దతుగా ఈ నెల 8న జరగనున్న భారత్ బంద్ను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య
కడప(రవీంద్రనగర్),డిసెంబరు 5: రైతు ఆందోళనకు మద్దతుగా ఈ నెల 8న జరగనున్న భారత్ బంద్ను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల చట్టం సవరణ చేయడం వల్ల చౌకదుకాణాల ద్వారా పేదలకు నిత్యావసర వస్తువులు దూరమవుతాయ న్నారు. వెంటనే వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వీరశేఖర్, రామయ్య ఎల్.నాగసుబ్బారెడ్డి, చంద్ర, బషీరున్నీసా, ఎంవీ సుబ్బారెడ్డి, రమణ, వెంకటశివ, శేఖర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.