-
-
Home » Andhra Pradesh » Kadapa » bhakti sradhdhalato vasavi jayanti-MRGS-AndhraPradesh
-
భక్తిశ్రద్ధలతో వాసవీ జయంతి!
ABN , First Publish Date - 2022-05-12T05:05:24+05:30 IST
వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా బుధవారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలోని అమ్మవారిని పు ష్పాల తో ప్రత్యేకంగా అలంకరించారు.
మదనపల్లె అర్బన్, మే 11:వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా బుధవారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలోని అమ్మవారిని పు ష్పాల తో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం మహిళలు దేవళంవీధిలోని ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నుంచి గంగను తెచ్చి అమ్మవారిని అభిషేకించారు. అనంతరం హోమాలు, పూజలు, మధ్యాహ్నం అన్నదానం చేశారు. సాయంత్రం అ మ్మవారిని ఊరేగించారు. ఆర్యవైశ్యసంఘం, యువ జన సంఘం, మహిళా సంఘాల సభ్యులు పాల్గొ న్నారు.ఆర్యవైశ్యసంఘం అఽధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్, కార్యదర్శి సూరేగిరిధర్, ఉపాధ్యక్షుడు దేవతా సతీష్, హరిప్రసాద్ పర్యవేక్షించారు..
వాల్మీకిపురం: గరుడ పుష్కరిణి జలాలకు నగరోత్సవం నిర్వహించి బజారువీధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోని అమ్మవారిని అభి షేకించారు. పంచామృతాభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, వాసవీ హోమాలు నిర్వహించా రు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాలొ ్గన్నారు. చింతపర్తిలోని ఆలయంలో ఉత్సవాలు నిర్వహిం చారు. ఆలయ ధర్మకర్తలు కాంతరాజు, సతీష్, ఆర్య వైశ్య సంఘ నాయకులు మోహన్, శశిధర్, కిశోర్, భగవాన్, శివ, నాయకులు చింతల శివానందరెడ్డి, ఆనందరెడ్డి, నీళ్ల భాస్కర్, మదనమోహన్రెడ్డి, రవి, మహిళలు పాల్గొన్నారు.
ములకలచెరువు: పీటీఎం రోడ్డులోని వాసవీ కన్య కాపరమేశ్వరి ఆలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అ లంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
గుర్రంకొండ: బజారువీధిలోని ఆలయంలో అర్చన, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నదానం చేశారు.
బి.కొత్తకోట: పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. సాయంత్రం పిండి దీపాలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవీ మహిళా మండలి, వాసవీ వనితా క్లబ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
పెద్దతిప్పసముద్రం: అమ్మవారిని ప్రత్యేకంగా అంకరించి పూజలు చేశారు.సాయంత్రం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం, యువజన నాయకులు, వాసవీ మహిళా మండలి నాయకులు పాల్గొన్నారు.
పీలేరు: స్థానిక వాసవీ ఆలయంలో అభిషేకాలు, హోమాలు, అన్నదానం, అమ్మవారి పుష్పపల్లకి ఊరేగింపు నిర్వహించారు. కాణిపాకం ఆలయ పాలక మండలి సభ్యుడు మువ్వ నరసింహులుశెట్టి, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రామనారాయణ అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం వాసవి మహిళా మండలి, అవోపా, వాసవి యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.