భక్తరహళ్ళి హుండీ ఆదాయం రూ.6.56 లక్షలు
ABN , First Publish Date - 2022-08-17T05:15:02+05:30 IST
భక్తరహళ్ళి నరసంహస్వామి, జిల్లేడగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీల ద్వారా మొత్తం రూ. 6.56 లక్షల ఆదాయం వచ్చింది.
మడకశిర రూరల్, ఆగస్ట్టు 16 : భక్తరహళ్ళి నరసంహస్వామి, జిల్లేడగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీల ద్వారా మొత్తం రూ. 6.56 లక్షల ఆదాయం వచ్చింది. నరసంహస్వామి ఆలయ హుండీ నుంచి రూ. 3.81 లక్షల, ఆంజనేయస్వామి హుండీ నుంచి రూ.2.75 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన మనుమంతేగౌడ్, దేవదాయశాఖ ఈఓ నాగేంద్ర ప్రసాద్రావు మంగళవారం తెలిపారు. ఐదు నెలల్లో ఈ ఆదాయం వచ్చిందని, ఈ మొత్తాన్ని దేవదాయశాఖ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు చెప్పారు.