గ్రేడ్‌ సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-25T04:58:08+05:30 IST

గ్రేడ్‌ సమస్యలను పరిష్కరించి, మండలంలో ప్రతీ గ్రామానికి తాగునీరందించాలని ఎంపీడీవో శ్రీను సిబ్బందిని ఆదేశించారు.

గ్రేడ్‌ సమస్యలను పరిష్కరించాలి
సిబ్బందితో కలిసి పనులను పర్యవేక్షిస్తున్న ఎంపీడీవో, భగీరథ డీఈ

ఇంటింటికీ తాగునీరందించాలి

సిబ్బందికి ఎంపీడీవో శ్రీను ఆదేశం

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

కరకగూడెం, జనవరి 24: గ్రేడ్‌ సమస్యలను పరిష్కరించి, మండలంలో ప్రతీ గ్రామానికి తాగునీరందించాలని ఎంపీడీవో శ్రీను సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని చిలకలగుంపు, ఉమత్‌నగర్‌, ఉప్పలగుంపులో తాగునీటి సమస్యపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘తాగునీటి కోసం భగీరథ కష్టాలు’ అనే  శీర్షికన ప్రచురితం అవడంతో స్పందించిన భగీరథ డీఈ మహేందర్‌, ఏఈ వీరబాబు, ఎంపీడీవో శ్రీను ఆధ్వర్యంలో సమస్య ఉన్న గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీను మాట్లాడుతూ.. గ్రేడ్‌ పనులు త్వరగతి పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. చొప్పాలలో బ్రిడ్జి నిర్మాణం చేపడుతుండటంతో, గ్రెడ్‌ పైపు లైన్‌ సమస్య ఏర్పడిందని త్వరలోనే పరిష్కరిస్తామని భగీరథ ఏఈ వీరబాబు తెలిపారు. 

Updated Date - 2022-01-25T04:58:08+05:30 IST