నరసింహావతారంలో భద్రాద్రి రామయ్య
ABN , First Publish Date - 2022-01-07T00:28:24+05:30 IST
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం భద్రాద్రి రామయ్య
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం భద్రాద్రి రామయ్య నృసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారిని నృసింహావతారంలో అలంకరించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి అనంతరం నిత్యకల్యాణమండపానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారికి వేదపండితులు వేద విన్నపాలు సమర్పించగా అనంతరం నాళాయర దివ్య ప్రబందం, వేద పారాయణం పఠించారు.అనంతరం స్వామి వారికి నివేదన చేశారు.