యాప్లో భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు
ABN , First Publish Date - 2020-04-03T12:39:43+05:30 IST
యాప్లో భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు
భద్రాచలం: కరోనా వ్యాప్తి నియంత్రణకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో సీతారామచంద్రస్వామి వారి కల్యాణానికి ఈ ఏడాది భక్తులను అనుమతించని విష యం తెలిసిందే. ఈ క్రమంలో స్వామి వారి కల్యాణ తలంబ్రాలను నేరుగా భక్తులు పొందే వీలు లేకపోవడంతో.. ఈ అక్షింతలు కావాలనుకునేవారు ఆన్లైన్లో టీ యాప్ ఫోలియో యాప్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేశారు. ఈ విక్రయాలను గురువారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. గూగుల్ప్లేస్టోర్ నుంచి ఈయాప్ను డౌన్లోడ్ చేసుకుని, తలంబ్రాలను బుక్చేసుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఒక ప్యాకెట్ రూ.20చొప్పున ఒక్కొక్కరికి రెండు ప్యాకెట్లు మాత్రమే బుక్చేసుకునే వీలుంది.