నేటినుంచి ఆన్లైన్లో భద్రాద్రి ‘నవమి’ టికెట్లు
ABN , First Publish Date - 2021-03-05T08:45:58+05:30 IST
భద్రాచలంలో ఏప్రిల్ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి
కొత్తగూడెం కలెక్టరేట్, మార్చి 4: భద్రాచలంలో ఏప్రిల్ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్లైన్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. భక్తులు ఈ మహోత్సవాల టికెట్లను www.bhadrachalamonline.com నుంచి పొందాలని సూచించారు. రూ.5వేలు, రూ.2వేలు, రూ.1,116, రూ.500, రూ.200, రూ.100 సెక్టారు టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర సమాచారాన్ని 08743 232428 నెంబర్కు ఫోన్చేసి తెలుసుకోవచ్చన్నారు.