భద్రాద్రి‌లో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2021-05-18T18:30:54+05:30 IST

జిల్లాలో కరోనా రోగుల కోసం రూ.70 లక్షల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

భద్రాద్రి‌లో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో కరోనా రోగుల కోసం రూ.70 లక్షల రూపాయల వ్యయంతో  కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దృష్ట్యా  జిల్లా అధికారులతో మంత్రి పువ్వాడ కరోనా హై పవర్ కమిటీ రివ్యూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంతకు ముందు కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు మంత్రి పువ్వాడ అజయ్ ఆహారాన్ని అందించారు. 

Updated Date - 2021-05-18T18:30:54+05:30 IST