Telangana News: భార్య, కూతురిపై కత్తితో దాడి చేసిన భర్త
ABN , First Publish Date - 2022-05-25T15:58:04+05:30 IST
జిల్లాలోని ఇల్లందు పట్టణంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురుపై భర్త సుల్తాన్ కత్తితో దాడి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఇల్లందు పట్టణంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిపై భర్త సుల్తాన్ కత్తితో దాడి చేశాడు. భార్య జరీనాను కత్తితో పొడిచిన సుల్తాన్... ఆపై కూతురు సువ్వి(11) గొంతు కోశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానికులు వారిని ఇల్లందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.