Bhadradri kothagudem: వరుసగా ఐదు చోట్ల చోరీలు
ABN , First Publish Date - 2022-05-06T13:57:24+05:30 IST
జిల్లాలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల దుండగులు చోరీకి తెగబడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల దుండగులు చోరీకి తెగబడ్డారు. రెండు వైన్ షాపు లు, గోల్డ్ షాప్, మెడికల్ షాప్లలో దొంగల ముఠా చోరీలు చేసింది. భారీగా నగదును దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.