భద్రాద్రి కొత్తగూడేనికి..24 మంది సివిల్ ఎస్ఐలు
ABN , First Publish Date - 2020-10-28T10:32:10+05:30 IST
ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమిలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 24 మందిని కేటాయించారు
పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం జిల్లాకు కేటాయింపు
చుంచుపల్లి, అక్టోబరు 27: ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమిలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 24 మందిని కేటాయించారు. ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం కల్పించేలా వరంగల్ జోన్కు చెందిన ఈ24 మంది ఎస్ఐలను ఈ నెల 30వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా వరంగల్ డీఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం వారిని ప్రొబేషనరీ కాల పరిధి నిమిత్తం వివిధ పోలీస్స్టేషన్లకు కేటాయించనున్నట్టు సమాచారం. 24 మంది ఎస్ఐలలో ఎనిమిది మంది మహిళలు ఉండటం విశేషం.