రేపటి నుంచి భద్రాచలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు
ABN , First Publish Date - 2021-10-05T14:35:04+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. రేపు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనుంది. 15 వ తేదీన విజయదశమి సందర్భంగా శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీల (రావణ వధ) మహోత్సవ వేడుకలు జరుగనున్నాయి.