Bhadradri: గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం
ABN , First Publish Date - 2022-04-11T17:04:25+05:30 IST
భద్రాచలంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై పర్యటన కొనసాగుతోంది. కాగా గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది.
భద్రాద్రి: భద్రాచలంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై పర్యటన కొనసాగుతోంది. కాగా గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. గవర్నర్ పర్యటనకు కలెక్టర్, ఎస్పీ గైర్హాజరయ్యారు. మరోవైపు భద్రాద్రి పర్యటలో భాగంగా సీతారామస్వామిని తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామి వారికి తమిళిసై పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మిథిలా స్టేడియంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.