వైద్యులను నియమించడంలో ఇంత అలసత్వమా: ఎమ్మెల్యే వీరయ్య

ABN , First Publish Date - 2020-07-09T11:19:58+05:30 IST

ఊపిరి ఆందక వైద్యశాలకు వెళ్లిన ఓ మహిళ వైద్యం అందక సోమవారం రాత్రి మృతి చెందింది.

వైద్యులను నియమించడంలో ఇంత అలసత్వమా: ఎమ్మెల్యే వీరయ్య

ఆంధ్రజ్యోతి కధనానికి స్పందించిన ఎమ్మెల్యే

చర్ల వైద్యశాల తనిఖీ


చర్ల, జూలై 8: ఊపిరి ఆందక వైద్యశాలకు వెళ్లిన ఓ మహిళ వైద్యం అందక సోమవారం రాత్రి మృతి చెందింది. ఈ విషాద ఘటనపై ‘వైద్యం అందక ప్రాణం పోయింది’ అనే శీర్షికన ఆంధ్ర జ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీనిపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్పందించారు. చర్ల వైద్యశాలను తనిఖీ చేశారు. అక్కడ ఒకే నర్స్‌ విధులు నిర్వహిస్తూ కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద వైద్యశాల్లో వైద్యులను ఏర్పాటు చేయక పోవడంపై మండి పడ్డారు. వైద్యులను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్‌తో మాట్లాడు తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట నల్లపు దుర్గా ప్రసాద్‌, మురళి, జడ్పీటీసీ ఉర్పా శాంత తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-07-09T11:19:58+05:30 IST