ఏపీలో ప్రభుత్వానికి, థియేటర్లకు మధ్య రగడ: అంబికా కృష్ణ
ABN , First Publish Date - 2021-12-24T21:04:34+05:30 IST
సినిమా థియేటర్లపై ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అంబికా కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: సినిమా థియేటర్లపై ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అంబికా కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో ప్రభుత్వానికి, థియేటర్లకు మధ్య రగడ నడుస్తోందన్నారు. దాదాపు 55 థియేటర్లు స్వచ్ఛందంగా మూసేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సీ సెంటర్లలో రూ.5, 10తో థియేటర్ల నిర్వహణ అసాధ్యమన్నారు. ఈ విషయంపై మంత్రి పేర్నినాని పునరాలోచించాలని కోరారు. బీఫామ్ లైసెన్స్ దరఖాస్తులు పెండింగ్లో ఉంటే అనుమతించాలని అంబికా కృష్ణ తెలిపారు.