పందెం రాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-01-16T05:40:20+05:30 IST
మండలంలోని సీసంగుంతల గ్రామ సమీపంలోని తాంబేళ్ళ కొండ ప్రాంతంలో శుక్రవారం జరుగుతున్న కోడి పందేలపై డోన్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు.
డోన్(రూరల్),జనవరి 15: మండలంలోని సీసంగుంతల గ్రామ సమీపంలోని తాంబేళ్ళ కొండ ప్రాంతంలో శుక్రవారం జరుగుతున్న కోడి పందేలపై డోన్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. కోడి పందేల నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి నుంచి 3 బైకులు, 8 సెల్పోన్లు, 4 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజు, వెంకటేశ్వర్లు, చిన్న, మౌలాలి, రాకే్ష, సూరప్ప, నయీంబాషలను అరెస్టు చేసినట్లు డోన్ రూరల్ పోలీసులు తెలిపారు.