పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యమందించాలి : ఎంపీపీ

ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST

పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యమందించాలి : ఎంపీపీ

పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యమందించాలి : ఎంపీపీ

బషీరాబాద్‌, జూలై 2 : పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందించాలని బషీరాబాద్‌ ఎంపీపీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కరుణా అజయ్‌ప్రసాద్‌ అన్నారు. శనివారం బషీరాబాద్‌ పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌డీఎ్‌ఫ(ఆస్పత్రి అభివృద్ధి నిధులు) కింద నిధుల విడుదల, వ్యయంపై చర్చించారు. గతంలో విడుదలైన నిధులెన్ని ? ఏ మేరకు ఖర్చు చేశారనే దానిపై ఎంపీపీ ఆరా తీశారు. ఈ యేడాదికి సంబంధించి హెచ్‌డీఎఫ్‌ నిధులు రావాల్సి ఉందని ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్‌. రవీంద్రయాదవ్‌ తెలిపారు. తహసీల్దార్‌ ఎన్‌.వెంకటస్వామి, డాక్టర్‌.నవ్యశ్రీ, యూడీసీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST