మెరుగైన సేవలు అందించాలి
ABN , First Publish Date - 2022-08-12T04:59:29+05:30 IST
సచివాలయ ఉద్యోగులు మరింత మెరుగైన సేవలు అందిం చాలని ఆర్డీఓ ఆకుల వెంకటరమణ అన్నారు.
పోరుమామిళ్ల, ఆగస్టు 11: సచివాలయ ఉద్యోగులు మరింత మెరుగైన సేవలు అందిం చాలని ఆర్డీఓ ఆకుల వెంకటరమణ అన్నారు. గురువారం ఆయన పోరుమామిళ్లలోని స్త్రీశక్తి భవనంలో సచివాలయాల సిబ్బంది, వీర్వోలు, ఇంజనీరింగ్, హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన పథకాలను అర్హులకు చేరే విధంగా పని చేయాలన్నారు. జగనన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయించేలా కృషి చేయాలన్నారు. ప్రతి వారం రివ్యూ సమావేశం నిర్వహించి అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. హౌసింగ్ డీఈ, తహసీల్దార్ విజయకుమారి, ఎంపీడీఓ నూర్జహాన్, హౌసింగ్ ఏఈ రమేష్, పీఆర్ఏఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.