పేదలకు, వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్యసేవలందించాలి

ABN , First Publish Date - 2022-01-27T04:57:57+05:30 IST

పేదలకు, వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్యసేవలందించాలి

పేదలకు, వ్యాధిగ్రస్థులకు మెరుగైన వైద్యసేవలందించాలి
విద్యార్థులకు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్సీ మహేందరెడ్డి

చేవెళ్ల, జనవరి 26: ప్రజల ప్రాణాలను రక్షించి ఆ రోగ్యాన్ని కల్పించే వైద్యులు దేవుళ్లతో సమానమని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం చేవె ళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్‌ కళా శాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు చెక్కులను అందజేశా రు. కరోనా కాలంలో బాధితులకు చికిత్సలు చేస్తున్న వైద్యుల సేవలను ఆభినందిస్తున్నట్లు చెప్పారు. కళశాలలో ప్రతిభావంతులైన వైద్యు లు రాజ్‌ సంజయ్‌, డాక్టర్‌ రామకృష్ణ, సుమన్‌ లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేశా రు. డాక్టర్‌ గుర్రం లలితకు రూ.50వేలు అంద జేశారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు, వ్యాధిగ్రస్తు లకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల సీఈవో డాక్టర్‌ సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ డార్టక్‌ రాజేశ్వర్‌రావు, చేవెళ్ల మార్కెట్‌ కమిటీ మాజీ వైఎస్‌ చైర్మన్‌ మాణిక్యరెడ్డి, వైద్య కళశాల సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T04:57:57+05:30 IST