భూదాన్ పోచంపల్లికి ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు ప్రదానం
ABN , First Publish Date - 2021-12-03T08:10:28+05:30 IST
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్(యూఎన్డబ్లూటీఓ) గురువారం భూదాన్ పోచంపల్లికి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామ అవార్డును ప్రదానం చేసింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో యూఎన్డబ్లూటీఓ జనరల్ అసెంబ్లీ 24వ సమావేశంలో
ప్రపంచ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు: శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్(యూఎన్డబ్లూటీఓ) గురువారం భూదాన్ పోచంపల్లికి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామ అవార్డును ప్రదానం చేసింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో యూఎన్డబ్లూటీఓ జనరల్ అసెంబ్లీ 24వ సమావేశంలో ‘బెస్ట్ టూరిజం విలేజ్’ అవార్డుకు భూదాన్ పోచంపల్లి ఎంపికైంది. స్పెయిన్లోని భారత రాయబార కార్యాలయ కార్యదర్శి సుమన్ శేఖర్ ఆ అవార్డును స్వీకరించినట్టు రాష్ట్ర మంత్రి శ్రీనివా్సగౌడ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన కార్యక్రమాన్ని మంత్రి వర్చువల్ విధానంలో వీక్షించారు. అనంతరం శ్రీనివా్సగౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ పర్యాటక రంగం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. గత 7 సంవత్సరాలలోనే అంతర్జాతీయ స్థాయిలో ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా భూదాన్ పోచంపల్లి గ్రామం ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందినట్టు తెలిపారు.